ప్రజల భూమి కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు

84చూసినవారు
ప్రజల భూములు కాజేసేందుకు వైసిపి ప్రభుత్వం లాండ్ టైటిలింగ్ యాక్ట్ కొత్త మోసానికి తెరలేపిందని బీజేపీ మహిళా నేత సాదినేని యామిని శర్మ విమర్శించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మోడల్ డ్రాప్ట్ ను వైసిపి ప్రభుత్వం భూదోపిడీకి అనుకూలంగా మార్చుకొని చీకటి జీవోలో తెచ్చిందని ఆరోపించారు. ఐదేళ్లుగా వైసిపి నాయకులు ప్రభుత్వ, దేవాదాయ భూములు దోచుకున్నారన్నారు.

సంబంధిత పోస్ట్