సెప్టెంబర్ 1న నెల్లూరులో జరిగే ఆదివాసి పోరాట సంఘీభావ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం పిడుగురాళ్ల, లెనిన్ నగర్ లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కార్పొరేట్ లకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో ఆదివాసులు పోరాడుతున్నారు. వారికి సంఘీభావంగా ప్రజలందరూ ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు.