నరసరావుపేటలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

77చూసినవారు
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నరసరావుపేటలోని పల్నాడు జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు ఫ్రంటైన్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్. రామచంద్రరావు, అటవీ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్