పౌష్టికాహారంతో రక్తహీనత నివారణ: శశిదేవి

65చూసినవారు
పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మహిళల్లో రక్తహీనత నివారించవచ్చని రొంపిచర్ల సెక్టార్ ఐసిడిఎస్ సూపర్వైజర్ శశిదేవి తెలిపారు. సోమవారం రొంపిచర్ల గ్రామంలోని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహార మహోత్సవాన్ని నిర్వహించారు. సూపర్వైజర్ మాట్లాడుతూ. గర్భిణీలు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల బిడ్డ ఎదుగుదల తగ్గి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్