వరద నష్టానికి పరిహారం చెల్లిస్తాం: పల్నాడు కలెక్టర్

69చూసినవారు
వరద నష్టానికి పరిహారం చెల్లిస్తాం: పల్నాడు కలెక్టర్
పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన ఆస్తి, పశు నష్టానికి సీఎం ఆదేశాల మేరకు పరిహారం చెల్లిస్తామని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు వెల్లడించారు. బుధవారం వరద నష్టం వివరాలపై రెవెన్యూ స్పెషల్ సీఎస్ రాం ప్రకాశ్ సిసోడియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి పాల్గొని జిల్లాలో వరద నష్టం వివరాలు తెలియజేశారు. పల్నాడు జిల్లాలో 15 మండలాలకు చెందిన 30 గ్రామాల్లో వరద ప్రభావం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్