వినుకొండలో కత్తులతో వీరంగం చేసిన వ్యక్తులపై కేసు నమోదు

5347చూసినవారు
వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద బుధవారం సాయంత్రం కొందరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద ఇరువర్గాల వారు గొడవలకు దిగి కత్తులతో దాడులకు పాల్పడబోయారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందగా, సీసీ కెమెరాలో దృశ్యాలను పరిశీలించి గొడవపడ్డ యువకులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్