బొబ్బిలి: పంచాయతీల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

82చూసినవారు
బొబ్బిలి: పంచాయతీల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
పంచాయతీల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వామ్యం ముఖ్యమని జిల్లా పరిషత్‌ సిఇఒ బి. వి. సత్యనారాయణ అన్నారు. గురువారం బొబ్బిలి మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులు అభివృద్ధి పనులకు ఏవిధంగా ఖర్చు చేయాలో సర్పంచ్‌తో కలసి వార్డు సభ్యులు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

సంబంధిత పోస్ట్