బొబ్బిలి మండల పరిధిలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలైన కృపవలస, దీవెనవలస, రామన్న వలస, సీయోనువలస, చిన్న అక్కేనావలస గ్రామాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ కోరారు. ఈ సందర్బంగా శుక్రవారం బొబ్బిలి ఎంపీడీవోకి వినతిపత్రం అందించారు. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే నివాసముంటున్న ఆ గ్రామాలను దగ్గరలో ఉన్నటువంటి పంచాయతీల్లో చేర్పించాలన్నారు.