బోర్ తీశారు.. పరికరాలు బిగించడం మరిచారు

56చూసినవారు
బోర్ తీశారు.. పరికరాలు బిగించడం మరిచారు
కొమరాడ మండలం జల గ్రామంలో త్రాగునీటి కోసం బోర్ తీసి హెడ్ బిగించకపోవడంతో త్రాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ఆదివారం తెలిపారు. మంచినీటి సౌకర్యం కోసం బోరుబావిని తీసి 50 రోజులు కావస్తున్న నేటికీ వినియోగానికి నోచుకోలేదన్నారు. సమీపంలో ఉన్న గడ్డ వాగు నుంచి నీరు గ్రామస్తులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే బోరుకు హెడ్ బిగించి మంచినీరు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్