రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రి పదవులు కల్పించాలని ట్రైబల్ రైట్స్ ఫారం రాష్ట్ర అధ్యక్షుడు రోబ్బ లోవరాజు కోరారు. శుక్రవారం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల జనాభా ఉన్న గిరిజనులు వారి జీవనస్థితి గతులు మార్చేందుకు గిరిజన సంక్షేమశాఖతో పాటు అటవీ శాఖలు కేటాయిస్తే అనుకూలంగా ఉంటుందని సూచించారు.