ఆటో బోల్తాపై ఎస్టి కమిషన్ ఆరా

81చూసినవారు
ఆటో బోల్తాపై ఎస్టి కమిషన్ ఆరా
సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పై రాష్ట్ర ఎస్టి కమిషన్ చైర్మన్ డా. డివిజి శంకరరావు సోమవారం ఆరా తీశారు. సంబంధిత అధికారులు, వైద్యులతో కమిషన్ చైర్మన్ స్వయంగా మాట్లాడి గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశించారు. ఆటోలో 18 మంది గిరిజనులు ప్రయాణిస్తున్నారు. 14 మందికు గాయాలు తగిలాయి. గాయాలైన వారిని శ్రీకాకుళం, సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రిలకు తరలించారు.

సంబంధిత పోస్ట్