ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెరిగేలా సేవలందించాలి

57చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెరిగేలా సేవలందించాలి
ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగేలా, నాణ్యమైన వైద్య సేవలందించాలని మన్యం జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో వైద్యశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 10 నుండి 19 సంవత్సరాల వయస్సుగల బాలికలు అందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యశాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్ష జరిపారు.

సంబంధిత పోస్ట్