సమిష్టిగా పాలకొండ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కౌన్సిలర్లు సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ శనివారం అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన ను మున్సిపల్ కమిషనర్ సర్వేశ్వరరావు కార్యాలయంలోని పలు విభాగాలు అధికారులతో కలిసి సాదరంగా ఆహ్వానించారు. వివిధ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, సత్తిబాబు, పాల్గొన్నారు.