దుగ్గేరులో ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలన

83చూసినవారు
దుగ్గేరులో ప్రకృతి వ్యవసాయ పంటలు పరిశీలన
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు యూనిట్ పనసభద్ర గ్రామంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అవలంభిస్తున్న రైతుల ఏ టి ఎమ్, ఏ గ్రేడ్ మోడల్ పంటలను ఎన్ఎఫ్ఏ ఆర్. శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సాగులో వరి గట్లుపై కంది, కూరగాయలు వేసుకోవాలని, మొక్కజొన్న, జీడిమామిడిలో అంతర పంటలు వేసుకోవాలని అన్నారు. రైతులందరు ప్రకృతి వ్యవసాయ అన్ని రకాల పద్ధతులు పాటించే విధంగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్