వాహన తనిఖీలు ముమ్మరం

52చూసినవారు
వాహన తనిఖీలు ముమ్మరం
మన్యం జిల్లా సీతానగరం గ్రామం హనుమాన్‌ జంక్షన్‌లో శనివారం సిఐ కె. రవికుమార్‌ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాహనాల్లో ఆయుధ సామగ్రి తరలించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ, ఎఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్