శృంగవరపుకోట: మండలంలో పల్లె పండగ కార్యక్రమాలు

69చూసినవారు
శృంగవరపుకోట: మండలంలో పల్లె పండగ కార్యక్రమాలు
ఎస్ కోట మండలం సంత గౌరమ్మపేట, కొత్తూరు, పోతనాపల్లి, వేములాపల్లి, గోపాలపల్లి గ్రామాల్లో శనివారం ఎంపీడీవో సతీష్ ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధా రాజు, నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు తదితరులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఓపిఆర్డి లక్ష్మి, పంచాయతీరాజ్ ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్