క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించాలి

80చూసినవారు
క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించాలి
క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి. జగన్మోహనరావు ఆదేశించారు. కుమ్మరిగుంట గ్రామాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. జ్వరాలు, రక్తహీనత ఉన్న వారిని నివారణయ్యేవరకు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. గర్భిణిల గృహ సందర్శన చేసి ఎంసిపి కార్డులను పరిశీలించారు. అంగన్వాడీ సిబ్బంది అందజేస్తున్న పౌష్టికాహారం వివరాలపై అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్