వరద నీటిలో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం

81చూసినవారు
వరద నీటిలో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇంటి స్థలం కూడా వరద నీటిలో మునిగిపోయింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల 52 సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో ఇంటి నిర్మాణ స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్