గతంలో పదవి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నారని మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారు. "పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లావేళ్లా పడ్డారు. పదవి ఇవ్వకపోవడంతో నాపై కసి పెంచుకున్నారు. ఇప్పుడు అక్రమాలను ప్రశ్నించినవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు." అని ఆయన మండిపడ్డారు. కాగా, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిరణ్కుమార్రెడ్డి పోటీ చేయనున్నారు.