AP: పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చేలరేగగా.. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గన్మెన్లను వదిలేసి వెళ్లారని సమాచారం. 144 సెక్షన్ నేపథ్యంలో వారు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరూ విశ్రాంతి కోసం HYD వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు.