పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ప్లెక్సీల వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు వారు ఘర్షణకు దిగి, పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.