దర్శి: మినీ ఆటోలో నగదు చోరీ

78చూసినవారు
దర్శి పట్టణంలో మంగళవారం మినీ ట్రాలీ ఆటోలో ఉంచిన రూ. 4. 50 లక్షల నగదును దుండగులు చోరీ చేశారు. పెద్ద చెర్లోపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు వినుకొండలో గొర్రెలను అమ్ముకొని తిరిగి వస్తున్నారు. దర్శి లోని ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు ఆగి ఉండగా మినీ ఆటోలో ఉన్న రూ. 4. 50 లక్షలు నగదును ఆటో అద్దం పగలగొట్టి దోచుకు వెళ్లినట్లుగా తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్