వేతనాల కోసం 36 గంటల ధర్నా

53చూసినవారు
కొమరోలు మండల స్వచ్ఛభారత్ పారిశుద్ధ్య కార్మికులు తమ వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. సోమవారం రాత్రి ఎంపీడీవో కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు తమ నిరసనను తెలుపుతూ నిద్రించారు. 4 సంవత్సరాలుగా తమ వేతనాలు చెల్లించలేదని వారన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తమ వేతనాలను చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్