కంభంలో: రికార్డింగ్ డాన్సులు చేయించిన వారిపై బైండోవర్ కేసులు

75చూసినవారు
కంభంలో దసరా ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు చేయించిన 7 మందిపై శుక్రవారం పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. గురువారం రాత్రి అమ్మవారి శాల కమిటీ సభ్యులు దసరా ఉత్సవాల పేరిట రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. డబల్ మీనింగ్ పాటలకు డాన్సర్లు అశీలంగా డాన్సులు వేశారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కంభం పోలీసుల దృష్టికి వచ్చింది. నిర్వాహకులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్