కనిగిరి: అధికారులకు ముచ్చెమటలు పట్టించిన బల్లి

72చూసినవారు
అధికారులకు ముచ్చెమటలు పట్టించింది ఓబల్లి. కనిగిరిలోని స్టేట్ బ్యాంక్ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన కనిగిరి ఎస్సై శ్రీరామ్ తన సిబ్బందితో కలిసి బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు అధికారులను పిలిపించి బ్యాంకును పరిశీలించారు. అయితే అలారం ఉండే బోర్డులోకి బల్లి వెళ్లడంతో హై వోల్టేజ్ తో అలారం మోగిందని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్