పోలీసు కార్యక్రమానికి 68 ఫిర్యాదులు

70చూసినవారు
పోలీసు కార్యక్రమానికి 68 ఫిర్యాదులు
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 68 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను గురించి స్వేచ్ఛగా ఏఎస్పీకి విన్నవించుకున్నారు. కాగా ఈ అర్జీలను త్వరగా పరిష్కరించాల్సిందిగా ఏఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. వారికి త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్