వినాయకుడికి పూజలు చేసిన ఎమ్మెల్యే జనార్దన్

77చూసినవారు
వినాయకుడికి పూజలు చేసిన ఎమ్మెల్యే జనార్దన్
ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆదివారం ఒంగోలు నగరంలోని 36వ డివిజన్ లో అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణనాథుడుని సందర్శించారు. అనంతరం మండపం నందు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జనార్ధన్ ను పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్