గిద్దలూరు మండలం పరమేశ్వర నగర్ కు చెందిన టిడిపి కార్యకర్త మునయ్యను వైసిపి కార్యకర్తలు హత్య చేయడంపై గిద్దలూరు టిడిపి ఇన్ ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి మంగళవారం తీవ్రంగా ఖండించారు. టిడిపి కార్యకర్త మునయ్య ప్రజా గళం సభకు భారీగా కార్యకర్తలను తరలించాడని అక్కస్సుతో వైసిపి కార్యకర్తలు గొడ్డలితో దాడి చేసి హత్య చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని అశోక్ రెడ్డి కోరారు.