ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన గొట్టిపాటి లక్ష్మి

76చూసినవారు
దర్శిలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ. 20 మంది ప్రముఖ వైద్యులు రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు సరఫరా చేస్తారని చెప్పారు. అలాగే, శిబిరంలో వైద్య సేవలందించేందుకు అమెరికాలో వైద్య సేవలందిస్తున్న ఇద్దరు డాక్టర్లు ఇక్కడకు వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్