ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం సలకలవీడు గ్రామంలో బుధవారం ఎన్నికలపై బెస్తవారిపేట ఎస్సై నరసింహారావు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని ఎస్సై నరసింహారావు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.