కంభం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు

76చూసినవారు
కంభం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు
కంభం పట్టణంలో శుక్రవారం మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వాహనదారుడుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు వెల్లడించారు. రాత్రి సమయంలో వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా ఎస్సై చెప్పారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశామని శనివారం మేజిస్ట్రేట్ ముందు ఆ వ్యక్తిని ప్రవేశపెట్టి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని నరసింహారావు తెలిపారు.

సంబంధిత పోస్ట్