కంభంలో: మద్యం పాలసీపై మీడియా సమావేశం

69చూసినవారు
కంభం ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ బాలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. నూతన మద్యం పాలసీపై బాలయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 9వ తేదీలోపు నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ లో కానీ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తుదారుడు రూ. 2 లక్షలు డి. డి తీయాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్