హెల్మెట్ పై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి

64చూసినవారు
హెల్మెట్ పై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి
గిద్దలూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ హెల్మెట్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలకు గురైతే తలకు బలమైన గాయాలు కావడం వల్ల మనిషి ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యం పొందడం జరుగుతుందని వాహనదారులను జడ్జి ఓంకార్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్