రాచర్ల: రంగస్వామి గుండానికి వరదనీరు

85చూసినవారు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జె. పిచెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 2 రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. గుండంలోకి ఎవరు ఈతకు వెళ్లకుండా భద్రతను ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్