క్రీడలతోనే మానసిక ఉల్లాసం : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

59చూసినవారు
గిద్దలూరులోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయిలో క్రీడలు జరుగుచున్నవి. ఈ కార్యక్రమంలో శనివారం గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. 6 మండలాలకు చెందిన విద్యార్దులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దారుఢ్యంకు మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్