కనిగిరి: పాఠశాలను తనిఖీ చేసిన జడ్జి

59చూసినవారు
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి భరత్ చంద్ర శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాలలో బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో జడ్జి మాట్లాడుతూ.. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారా? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్