కనిగిరి: మద్యం షాపులు వద్దంటూ మహిళలు ఆందోళన

83చూసినవారు
జనావాసాలు సంచరిస్తున్న ప్రదేశాలలో మద్యం షాపులను నిర్వహించవద్దంటూ మహిళలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కనిగిరిలోని ఆర్టీసీ డిపో వద్ద మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నివాసాల మధ్య షాపులను నిర్వహిస్తున్నారని, ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణ స్పందించాలన్నారు. మద్యం షాపులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. మద్యం దుకాణాన్ని ఎత్తివేయకుంటే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్