కనిగిరి మండలం చాకిరాల గ్రామానికి చెందిన 56 కుటుంబాలు కుందురు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వైసీపీ పార్టీ ని వీడి టీడీపీ పార్ట లో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరిని అభినందించారు.ఈ కార్యక్రమం లో గ్రామ నాయకులు,టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.