రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

72చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి సింగరాయకొండకు చెందిన చంద్రమోహన్ అక్కడికక్కడే మృతి చెందగా అతని కుమారుడు ఏడుకొండలుకు గాయాలయ్యాయి. వ్యక్తిగత పనులపై చంద్రమోహన్ ఒంగోలుకు వెళ్లి సింగరాయకొండ కు వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్