నాణ్యమైన పొగాకు వేలానికి తీసుకురావాలి

78చూసినవారు
నాణ్యమైన పొగాకు వేలానికి తీసుకురావాలి
టంగుటూరు పొగాకు వేలం కేంద్రానికి నాణ్యమైన బేళ్లు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచించారు. స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం గరిష్ట ధర కేజీ రూ. 360 పలికింది. దావగూడూరు, చింతల పాలెం గ్రామాల రైతులు 1174 బేళ్లు వేలానికి తీసుకురాగా వాటిలో 1112 కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 62 బేళ్లు తిర స్కరించారు. కనిష్ట ధర కేజీ రూ. 205, సరాసరి ధర రూ. 282. 72 పలికింది.

సంబంధిత పోస్ట్