విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేఏ పాల్, వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 19కి వాయిదా వేసింది.