ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లో శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.