కమెడియన్ ఆలీ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలబడనున్నట్లు తెలుస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూల్ లేదా నంద్యాల జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఏపీ సీఎం
జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అలీ ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా కొనసాగుతున్నారు.