ఏపీలో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు

23608చూసినవారు
ఏపీలో పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో సోమ‌వారం భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్ల‌డించింది. చిత్తూరు, తిరుప‌తి, అన్న‌మ‌య్య‌, అనంత‌పురం, శ్రీ స‌త్య‌సాయి, కృష్ణా, ఉమ్మ‌డి తూర్పు గోదావరి, పశ్చిమ జిల్లాల్లో వాన‌లు ప‌డ‌తాయ‌ని తెలిపింది. ప‌లు చోట్ల‌ ఉరుములు, మెరుపుల‌తో పాటు పిడుగులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్