తెలంగాణలోని భువనగిరిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక పెట్రోల్ బంక్ లోకి ఓ లారీ వచ్చి.. డీజిల్ కొసం టర్న్ తీసుకుంటుండగా ఒక్కసారిగా ఆ వాహన డీజిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే బంక్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక సిలిండర్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.