కాంగ్రెస్-ఎస్పీ కూటమికి యూపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రయాగ్రాజ్లో ఇవాళ జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్-ఎస్పీ కూటమిని ఆశీర్వదించేందుకు పెద్దసంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు ఇక్కడికి తరలివచ్చారని అన్నారు. బీజేపీని మట్టికరిపించేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.