ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం-లంబసింగి రహదారిపై రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో భర్త మృతి చెందగా.. భార్య, కుమారుడికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని ఆస్ప్రత్రికి తరలించారు. గాయపడిన తల్లీకొడుకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.