AP: 'తల్లికి వందనం' పథకంపై టీడీపీ అధిష్టానం సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 'తల్లికి వందనం' కింద రూ.15,000 చొప్పున సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గత జగన్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదివినా 'అమ్మఒడి' పథకం కింద రూ.13,000 ఒక్కరికే ఇచ్చారని టీడీపీ అధిష్టానం మండిపడింది.