AP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు తెలుస్తోంది. పాల్వాయిగేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో దాడులు, టీడీపీ నాయకులపై దాడుల ఘటనలకు సంబంధించి వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని సమాచారం. దీనిపై పోలీసలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.