AP: గుంటూరు(D) తెనాలిలో రేషన్ సరుకులు నిల్వ చేసిన గోదాములో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. పంచదార, కందిపప్పు, నూనె వంటివి ప్యాకెట్కు 50-100 గ్రాములు తక్కువ బరువున్నట్లు ఆయన గుర్తించారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించగా.. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి ఆదేశించారు.